‘సాహో’కి సైన్ చేసిన మరొక బాలీవుడ్ నటి !

‘సాహో’కి సైన్ చేసిన మరొక బాలీవుడ్ నటి !

Published on Apr 19, 2018 3:55 PM IST

ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం రోజుకో విశేషాన్ని సంతరించుకుంటోంది. సుమారు రూ.200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఇంటర్నేషన్ టెక్నీషియన్స్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుల్ని కూడా తీసుకున్నారు దర్శక నిర్మాతలు.

ఇప్పటికే ఇందులో హిందీ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రలోను, శ్రద్దా కపూర్ కథానాయికగాను, మందిరా బేడీ, టిన్ను ఆనంద్ వంటి వారు పలు కీలక పాత్రల్లో నటిస్తుండగా ఇప్పుడు మరొక బాలీవుడ్ నటి ఎవెలిన్ శర్మ కూడ ఈ సినిమాకు సైన్ చేసింది. ఇందులో ఆమె యాక్షన్ మోతాదు ఎక్కువగా ఉండే పాత్రలో నటించనుంది. ఇలా ‘సాహో’లో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నానని, సంతోషంగా ఉందని ఎవెలిన్ శర్మ అన్నారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు