తెలుగులో సినిమా చేయనున్న బాలీవుడు దర్శకుడు !

తెలుగులో సినిమా చేయనున్న బాలీవుడు దర్శకుడు !

Published on Apr 30, 2017 5:34 PM IST


హిందీలో ‘ఫనా, హమ్ తుమ్, తేరి మేరి కహాని’ వంటి సినిమాల్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగులో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని వినికిడి. ఎన్నాళ్లగానో డైరెక్ట్ తెలుగు సినిమాను రూపొందించాలని కథ రెడీ చేసుకుని సరైన నటీనటుల కోసం ఎదురుచూస్తున్న కునాల్ తాజాగా తన కథకు మిల్కీ బ్యూటీ తమన్నా అయితే సరిగ్గా సరిపోతుందని ఆమెను ఫైనల్ చేశారట.

తమన్నా కూడా కునాల్ చెప్పిన కథ, తన పాత్ర చిత్రీకరణ విని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వినికిడి. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ ప్రాజెక్టును జూన్ నుండి మొదలుపెట్టే అవకాశాలున్నాయట. కానీ ఈ విషయంపై ఇంకా కునాల్ కోహ్లి, తమన్నాల నుండి ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ బయటకు రాలేదు. ఇకపోతే తమన్నా ప్రస్తుతం పలు తమిళ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. అంతేగాక ఆమె నటించిన తాజా చిత్రం ‘బాహుబలి-2’ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు