బాలీవుడ్ కు వెళ్లనున్న నారా రోహిత్ చిత్రం !

బాలీవుడ్ కు వెళ్లనున్న నారా రోహిత్ చిత్రం !

Published on Mar 23, 2017 4:23 PM IST


పోయిన ఏడాది డిసెంబర్ 30న రిలీజైన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొంది మంచి చిత్రంగా నిలిచింది. హైదరాబాద్లోని ఒక యువకుడి నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నారా రోహిత్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించగా శ్రీ విష్ణు మరొక కీలక పాత్ర పోషించారు.

భిన్నమైన కథ, ఆకట్టుకునే కథనమే ప్రధాన బలాలుగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ చిత్రం పై బాలీవుడ్ నిర్మాతల దృష్టి పడింది. రియలిస్టిక్ గా నడిచే సినిమాలకు ఆదరణ బాగా పెరిగిన నైపథ్యంలో ఈ సినిమానౌ హిందీలో రీమేక్ చేయాలని ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్ణయించుకుందట. అయితే ఆ సంస్థ ఏది, సినిమానౌ ఎవరు డైరెక్ట్ చేస్తారు, నటీనటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు