విదేశీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బోయపాటి చిత్రం !

విదేశీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బోయపాటి చిత్రం !

Published on Feb 26, 2017 7:48 PM IST


హీరోలని యాక్షన్ యాంగిల్ లో ప్రెజెంట్ చేయడంలో చేయి తిరిగిన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. గతేడాది ఆయన డైరెక్ట్ చేసిన ‘సరైనోడు’ చిత్రం అల్లు అర్జున్ ని తిరుగులేని మాస్ హీరోని చేసింది. ఆ చిత్రంతో బన్నీ స్టార్ స్టేటస్ కూడా అమాంతం పెరిగిపోయింది. అలాంటి సత్తా ఉన్న దర్శకుడు బోయాపాటి ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఫుల్ లేట్ యక్ష్ణ ఎంటర్టైనర్ గానే ఉండనుంది.

ఈ మధ్యే ఈ చిత్ర బృందం షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లారు. సినిమాలో మేజర్ బడ్జెట్ ఖర్చు పెట్టి జరిపిన షెడ్యూల్ ఇదే కావడం విశేషం. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, రకుల్ ప్రీత్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు