పక్కా ప్లాన్‌తో వెళుతోన్న ‘జనతా గ్యారెజ్’ టీమ్

పక్కా ప్లాన్‌తో వెళుతోన్న ‘జనతా గ్యారెజ్’ టీమ్

Published on Jun 26, 2016 11:50 AM IST

janathagarage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఒక స్టార్ హీరో సినిమాను సెట్స్‌పైకి వెళ్ళకముందే విడుదల తేదీతో సహా ప్రకటించిన సినిమా యూనిట్, చెప్పినట్లుగానే ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పక్కాగా సిద్ధమవుతోంది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షూట్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది.

ఒక భారీ క్లైమాక్స్ ఎపిసోడ్, ఒక పాటను వచ్చే నెలలో చిత్రీకరించనున్నారు. జూలై నాలుగోవారం కల్లా సినిమా షూటింగ్ మొత్తం పూర్తికానుంది. అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్‌ను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేసింది. దీంతో సినిమా ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేయడానికి ఏ ఆటంకాలూ లేవన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటుతోన్న ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు