చరణ్ ‘రంగస్థలం’ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. సుకుమార్ తన స్టైల్ లో తెరకెక్కించిన సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అనసూయ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
మార్చి 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను వైజాగ్ లో భారీ ఎత్తున చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఈ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. మొదటిసారి పల్లెటూరి మాస్ గెటప్ లో చరణ్ చేస్తోన్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి చరణ్ కి సోదరుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
- చరణ్ రికార్డును క్రాస్ చేసిన మహేష్ !
- భారీ ఓపెనింగ్స్ అందుకోనున్న ‘భరత్ అనే నేను’ !
- ‘భరత్ అనే నేను’పై దర్శక ధీరుడి ప్రశంసలు !
- ఒక్కటైన మెగాహీరోలు !
- అసలు సిసలు షో అంటే ఏమిటో చూపిస్తా – పవన్
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.