మహేష్ సినిమాకు కెమెరా కన్ను మారింది !

మహేష్ సినిమాకు కెమెరా కన్ను మారింది !

Published on Dec 16, 2017 4:00 PM IST

మహేష్ కొరటాల శివల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ సినిమా ప్రస్తుతం తమిళనాడు లోని కారై కుడి గ్రామంలో జరుగుతోంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న రవి కె. వర్మన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. తాజాగా ఆ స్థానంలో తిరు వచ్చి చేరాడు. కెమెరా మెన్ తిరు కొరటాల శివ గతంలో జనతా గ్యారేజ్ సినిమాకు పని చేసారు.

రవి కె వర్మన్ సినిమా నుండి బయటికి పోవడానికి అతని బిజీ షెడ్యూల్ కారణమని సమాచారం. తిరు ఈ సినిమా యూనిట్ లో జాయిన్ అవుతున్నందుకు ఆనందగా ఉందని ట్విట్టర్ లో తెలిపాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. భారి అంచనాల మద్య ఈ సినిమా ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటిసారి కైరాఅద్వాని ఈ సినిమాలో మహేష్ తో నటించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు