సెట్స్ పైకి వెళ్లనున్న క్రేజీ కాంబినేషన్

సెట్స్ పైకి వెళ్లనున్న క్రేజీ కాంబినేషన్

Published on May 7, 2015 8:38 AM IST

Naga-Chaitanyas-first-look
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన ‘దోచేయ్’ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. ఈ సినిమా సక్సెస్ తో నాగ చైతన్య చాలా హ్యాపీగా ఉన్నాడు. నాగ చైతన్య తన తదుపరి సినిమా ‘కార్తికేయ’ సినిమాతో పరిచయమైన చందు మొండేటి తో సైన్ చేసిన విషయం ఇది వరకే తెలియజేశాం. కానీ దీనికంటే ముందు నాగ చైతన్యకి ఫస్ట్ సక్సెస్ ఇచ్చిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో ఓ సినిమా ఉంటుందని కూడా చెప్పాము. ఇప్పుడు ఆ సినిమాపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

నాగ చైతన్య గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో చేయనున్న సినిమాని రేపటి నుంచి చెన్నైలో మొదలు పెట్టనున్నారు. అలాగే ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని చెన్నై లోనే షూట్ చేస్తారు. రేపటి నుంచి మొదలు కానున్న ఫస్ట్ షెడ్యూల్ కంటిన్యూగా 45 రోజుల పాటు జరగనుంది. ఏ మాయ చేసావే సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అక్కినేని అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నాడు. ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్ ని అన్వేషిస్తున్నారు. ఈ సినిమా మొదలైన కొద్ది రోజులకి చైతన్య – చందు సినిమా మొదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు