దేవిశ్రీ ప్రసాద్ ను అభినందించక తప్పదు !

దేవిశ్రీ ప్రసాద్ ను అభినందించక తప్పదు !

Published on Mar 16, 2018 12:26 AM IST

సినిమాకు పబ్లిసిటి చాలా అవసరం.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే అది మరీ ముఖ్యం. సినిమా థియేటర్లలో రెండు మూడు వారాలకంటే ఎక్కువగా ఉండడంలేదు కాబట్టి ఉన్న కొన్నిరోజులు జనాలు థియేటర్స్ కు రావడం చాలా ప్రధానం. ఇందుకోసం సినిమా వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు. తాజాగా రంగస్థలం ప్రెస్ మీట్ లో రచయిత చంద్రబోస్ పబ్లిసిటి గురించి ప్రస్తావించాడు.

చిరంజీవి నటించిన ‘ఖైది నెంబర్ 150’ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఒక్కోసారి ఒక పాటను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభం చేసాడని, అలా చెయ్యడం ద్వారా సినిమాకు మంచి పబ్లిసిటి రావడమే కాకుండా ప్రతి పాటను ప్రేక్షకులు వింటున్నారని చెప్పుకొచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో ఈ కొత్త ఒరవడిని సృష్టించిన దేవిని అభినందించక తప్పదని కూడ చంద్రబోస్ తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు