ఆగస్ట్ 3న చిరంజీవి స్పెషల్ ఎపిసోడ్ – మీలో ఎవరు కోటీశ్వరుడు

ఆగస్ట్ 3న చిరంజీవి స్పెషల్ ఎపిసోడ్ – మీలో ఎవరు కోటీశ్వరుడు

Published on Jul 22, 2014 12:53 PM IST

chiru_nag
మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై అతిధిగా సందడి చేయనున్నారు. కింగ్ నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో చిరు పాల్గొననున్నారు. చిరంజీవి పాల్గొనగా స్పెషల్ ఎపిసోడ్ ను ఇటివలే షూట్ చేశారు. ఈ ఎపిసోడ్ ఆగస్ట్ 3న ప్రసారం అవుతుంది. నాగార్జున చిరంజీవికి ఎటువంటు ప్రశ్నలు సందించారు. చిరు వాటికి ఎలాంటి సమాధానం ఇచ్చారు.. అనే విషయాలు తెలియాలంటే ఆగస్ట్ 3వ తేది వరకు వేచి చూడాలి. ప్రస్తుతం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం టి.అర్.పి రేటింగ్ లో దూసుకుపోతుంది. చిరంజీవి స్పెషల్ ఎపిసోడ్ రోజున మిగతా కార్యక్రమాలకు అందనంత ఎత్తులో టి.అర్.పి రేటింగ్ నమోదు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో పాటు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్వహిస్తున్న ‘సౌందర్య లహరి’ కార్యక్రమంలో కూడా చిరు సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం కానుందో ఇంకా తెలుపలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు