‘భరత్ అనే నేను’ను చిరంజీవిగారు ఫోన్ చేసి మరీ పొగిడారు – దానయ్య

‘భరత్ అనే నేను’ను చిరంజీవిగారు ఫోన్ చేసి మరీ పొగిడారు – దానయ్య

Published on Apr 24, 2018 9:18 AM IST

మహేష్, కొరటాల శివల పొలిటికల్ ఎంటర్టైనర్ ‘భరత్ అనే నేను’ భారీ విజయం దిశగా దూసుకుపోతున్న సందర్బంగా చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దానయ్య మాట్లాడుతూ అందరూ గొప్ప సినిమా తీశావని పొగుడుతున్నారు, మెగాస్టార్ చిరంజీవిగారు ఫోన్ చేసి సినిమా గురించి గొప్పగా మాట్లాడారు, నటీనటుల్ని పొగిడారు ఆయనకు నా కృతజ్ఞతలు అన్నారు.

అలాగే ఈ నెల 27వ తేదీన తిరుపతిలో భారీ సక్సెస్ మీట్ నిర్వహిస్తామని కూడ అన్నారు. ఇక మహేష్ బాబు అయితే ఇంత గొప్ప హిట్ ఇచ్చినందుకు కొరటాల శివను ఆకాశానికెత్తేశారు. గతంలో ఒకసారి ఇలాంటి పరిస్థితుల్లోనే ‘శ్రీమంతుడు’ లాంటి హిట్ ఇచ్చిన కొరటాల మళ్ళీ ఇప్పుడు ‘భరత్ అనే నేను’ ఇచ్చారు. ఆయన, నేను ఎప్పుడూ సినిమాలు తీస్తూనే ఉంటాం, బ్లాక్ బస్టర్లు ఇస్తూనే ఉంటాం అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు