మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ళ తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ అంటూ వచ్చి అభిమానులకు సంబరాలను తెచ్చిపెట్టారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆయన రీ ఎంట్రీ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ సక్సెస్తో చాలా హ్యాపీగా ఉన్న ఆయన, అప్పుడే మళ్ళీ వర్క్ మోడ్లోకి వెళ్ళిపోవడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం చిరు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే గేమ్ షోకు సంబంధించిన షూటింగ్లో ఉన్నారు. హైద్రాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ షూట్ జరుగుతోంది.
మా టీవీలో ప్రసారమయ్యే ఈ షోకు మొదట్లో అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు. ఇక ఆయన తర్వాత ఆ స్థానంలో ఇప్పుడు చిరంజీవి ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి హోస్ట్గా వ్యవహరిస్తోన్న ఎపిసోడ్ ఇంకా ఏదీ మొదలవ్వలేదు. దీంతో బుల్లితెరపై చిరు ఎలా మెప్పిస్తాడో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటు మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తూనే, చిరు, తన తదుపరి సినిమా కోసం కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు.