ప్రసాద్ లాబ్స్ లో ‘గోవిందుడు..’ చూసిన చిరంజీవి.

ప్రసాద్ లాబ్స్ లో ‘గోవిందుడు..’ చూసిన చిరంజీవి.

Published on Sep 30, 2014 10:27 PM IST

Chiranjeevi
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా నటించిన పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారి తారాగణంతో వెండితెరపై కన్నుల పండుగగా నిర్మించారు బండ్ల గణేష్. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

విడుదలకు ఒక్క రోజు ముందు ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలసి ప్రసాద్ లాబ్స్ లో వీక్షించారు మెగాస్టార్ చిరంజీవి. స్క్రీన్ 1 లో చిరు & ఫ్యామిలీ కోసం స్పెషల్ షో ఏర్పాటు చేశారు నిర్మాత. సినిమా పూర్తయిన తర్వాత బండ్ల గణేష్, కృష్ణవంశిలను ప్రత్యేకంగా అభినందించారు. సినిమా పట్ల చిరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఘన విజయం సాదిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారట.

రామ్ చరణ్ సరసన ముచ్చటగా మూడోసారి హీరోయిన్ గా నటించింది కాజల్ అగర్వాల్. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలలో నటించారు. ప్రతి ఒక్కరి చేత కృష్ణవంశి అద్బుతమైన నటనను రాబట్టుకున్నారు అని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు