పూజా కార్యక్రమాలతో మొదలైన ‘ఉయ్యాలవాడ’

పూజా కార్యక్రమాలతో మొదలైన ‘ఉయ్యాలవాడ’

Published on Aug 16, 2017 5:00 PM IST


ఈ ఏడాది సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చి ‘ఖైదీ నెం 150’ తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమా గ్రాండ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్నాళ్లగానో చేయాలనుకుంటున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇన్నిరోజు స్క్రిప్ట్ కు సంబందించిన పనులు జరుపుకున్న ఈ చిత్రం ఈరోజు కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీసులో పూజా కార్యక్రమాలతో మొదలైంది.

ఈ కార్యక్రమానికి చిరుతో పాటు ఆయన సతీమణి, రామ్ చరణ్, అల్లు అరవింద్, పరుచూరి బ్రదర్స్ హాజరయ్యారు. అలాగే ఈ నెల 22 చిరు పుట్టినరోజు సందర్బంగా సినిమా యొక్క లోగోను కూడా లాంచ్ చేయనున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పట్ల మెగా అభిమానుల్లో మాత్రమేగాక తెలుగు ప్రేక్షకులందరిలోను భారీ క్రేజ్ నెలకొని ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు