‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ లోగో లాంచ్ ఎప్పుడో తెలుసా !

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ లోగో లాంచ్ ఎప్పుడో తెలుసా !

Published on Aug 14, 2017 6:19 PM IST


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ దాదాపు పూర్తి కాగా హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక వంటి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘ఖైదీ నెం 150’ విజయం తర్వాత చిరు చేస్తున్న ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలోనే చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా యొక్క లోగోను చిరు పుట్టినరోజైన ఆగష్టు 22న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారట. దీంతో ఒకేరోజు మెగా ఫ్యాన్స్ కు రెండు పండుగలు జరగనున్నాయి. ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. తోలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు