కొత్త సినిమాకి సైన్ చేసిన కలర్స్ స్వాతి ?

కొత్త సినిమాకి సైన్ చేసిన కలర్స్ స్వాతి ?

Published on Feb 19, 2017 5:09 PM IST


టెలివిజన్ రంగం నుండి వెండితెర మీదకు వచ్చి సక్సెస్ ఆయన అతి కొద్దిమంది నటీమణుల్లో కలర్స్ స్వాతి కూడా ఒకరు. ‘అష్ట చెమ్మ’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన స్వాతి ఆ చిత్రంతో ఉత్తమనటిగా ఫిలిం ఫేర్, నంది అవార్డులను గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించి వరుస ఛాన్సులు దక్కించుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో వరుస అవకాశాలతో ఒక వెలుగు వెలిగిన స్వాతి 2015లో వచ్చి పరాజయం పొందిన ‘త్రిపుర’ చిత్రంతో బాగా వెనుకబడ్డారు.

ఆ చిత్రం విడుదలై సంవత్సరం పైనే అవుతున్నా ఆమె తెలుగులో మరో సినిమా చేయలేదు. తాజాగా సినీ వర్గాల నుడ్ని అందుతున్న సమాచారం ప్రకారం స్వాతి తెలుగులో ఒక సినిమాకి సైన్ చేసిందట. నూతన దర్శకుడు ఆదిత్య డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో స్వాతి ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డతో కలిసి నటించనుందట. ఈ చిత్రం పూర్తిగా లవ్ ఎంటర్టైనర్ గా ఉండనుందని అంటున్నారు. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు