తెలుగు పరిశ్రమలోని స్టార్ కమెడియన్లలో ఒకరైన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కుటుంబానికి సంబదించిన వివాదంలో చిక్కుకుని హాట్ టాపిక్ గా మారారు. ఆయనతో ఉన్న మనస్పర్థల కారణంగా ఆయన భార్య కోర్టులో పిటిషన్ వేయడం, కోర్టు పృథ్వికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో ఈ వివాదం సంచలనంగా మారింది. ప్రస్తుతం పృథ్వి షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉండటం వలన అయన కుమారుడు సాయి శ్రీనివాస్ దీనిపై స్పందించారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ అమాయకురాలైన తమ తల్లి కోర్టుకు వెళుతుందని తాము ఊహించలేదని, ఎవరో ఆమెకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారని అన్నారు. ఇవి అందరి ఇళ్లల్లో ఉండే ఉండే సమస్యలేనని, కానీ మా ఇంట్లో సమస్య మాత్రం చిలికి చిలికి గాలివానై తమ తండ్రి పృథ్వి చేతులు దాటిపోయిందని అన్నారు. దాంతో తమ ఇంట్లో సంవత్సరం నుండి ఎవ్వరికీ ప్రశాంతత లేదని తెలిపారు.
ఇక ఈ వార్తతో పాటే వచ్చే అసత్యాలను నమ్మవద్దని, తన తండ్రి కష్టపడి పైకొచ్చారని, అయన ఎలాంటి వారో అందరికి తెలుసనీ కాబట్టి ఆయన నటనకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి ప్రచారం చేయవద్దని కోరారు.
తన తల్లిమీద ,తన తండ్రి మీద వచ్చిన న్యూస్ పై స్పందించిన 30 ఇయర్స్ ఇండస్ర్టీ పృద్వి కొడుకు సాయి శ్రీనివాస్. Part-01 pic.twitter.com/PFGw63LdSJ
— Vamsi Shekar PRO (@UrsVamsiShekar) June 29, 2017
తన తల్లిమీద ,తన తండ్రి మీద వచ్చిన న్యూస్ పై స్పందించిన 30 ఇయర్స్ ఇండస్ర్టీ పృద్వి కొడుకు సాయి శ్రీనివాస్. Part-02 pic.twitter.com/CSc6RkmyQ5
— Vamsi Shekar PRO (@UrsVamsiShekar) June 29, 2017