‘జై లవ కుశ’ అదిరిపోయేలా ఉంటుందంటున్న కమెడియన్ !

‘జై లవ కుశ’ అదిరిపోయేలా ఉంటుందంటున్న కమెడియన్ !

Published on Apr 25, 2017 6:45 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తారక్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తాజాగా సినీ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూట్ చాలా బాగ్ జరుగుతుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలోని కామెడియన్లలో ఒకరైన వేణు మాట్లాడుతూ ‘జై లవ కుశ’ చిత్రం అదిరిపోయేలా ఉంటుందని అన్నారు.

అంతేగాక ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులందరికీ ఒక పండుగలా ఉంటుందని, చాలా రోజుల తర్వాత తనకొక మంచి రోల్ దొరికిందని, ఇన్నాళ్లు వెయిట్ చేసినందుకు మంచి అవకాశమే దొరికిందని అన్నారు. ఇందులో తారక్ సరసన రాశి ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు