డైరెక్టర్ గోపీచంద్ మలినేని – మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో రాబోతున్న ‘క్రాక్’ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. కాగా ఈ చిత్రానికి అల్లు అరవింద్ మొదటి క్లాప్ నివ్వగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే ఫస్ట్ షాట్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా.. దిల్ రాజు మరియు సురేందర్ రెడ్డి కలిసి, గోపీచంద్ మలినేనికి స్క్రిప్ట్ ను అందజేశారు.
కాగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న ఈ సినిమాని 2020 సమ్మర్ లో విడుదల్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. రవితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.