గత సంవత్సరం మళయాలంలో వచ్చిన ’ప్రేమమ్’ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా మొదట్లో, చివరిలో వచ్చే ఓ వాయిస్ ఓవర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా వచ్చిన ’ప్రేమమ్’ సినిమా కి ఆ విధంగా వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ప్రేక్షకులకు మంచి మూడ్ ని క్రియేట్ చేయడంతో పాటు వాయిస్ ఓవర్ లో చెప్పిన మాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఇప్పుడు తెలుగులో కూడా అదేవిధంగా సినిమాలో వాయిస్ ఓవర్ ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారంట దర్శకుడు చందు మొండేటి. అలాగే ఈ వాయిస్ ఓవర్ కింగ్ నాగార్జున ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రేమ కథాంశం తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేయాలనుకున్నా… ఇదే సంస్థ హీరో వెంకటేష్ తో నిర్మిస్తున్న ’బాబు బంగారం’ చిత్రం జులైలో విడుదల అవుతుండటంతో ’ప్రేమమ్’ సినిమా ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. వంశీ సూర్యదేవర నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.