‘దర్శకుడు’ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే సినిమా అవుతుందట !

‘దర్శకుడు’ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే సినిమా అవుతుందట !

Published on Jul 26, 2017 11:15 AM IST


ప్రముఖ దర్శకుడు సుకుమార్ సంస్థ ‘సుకుమార్ రైటింగ్స్’ లో రూపొందిన రెండవ చిత్రం ‘దర్శకుడు’. సమంత, రకుల్ ప్రీత్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరో హీరోయిన్లతో ట్రైలర్, ఆడియో రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సినిమా ఆగష్టు 4న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాతలు విజయ్ కుమార్, థామస్ రెడ్డిలు పాల్గొన్నారు. సుకుమార్ సోదరుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ నేను దర్శకుడ్ని అయితే మిమ్మల్ని నిర్మాతల్ని చేస్తానన్న మాటని నా తమ్ముడు నిలబెట్టుకున్నాడు అన్నారు.

అలాగే పెద్ద హీరోలతో సినిమాలు ఉండటం వలన చిన్న సినిమాల్ని చేయలేకపోతున్నానని, సుకుమార్ రైటింగ్స్ తో ఆ లోటును తీర్చుకుంటున్నాడని థామస్ రెడ్డి అన్నారు. దర్శకుడు అనే టైటిల్ ఉన్నాడు వలన ఈ సినిమాలో దర్శకులపై సెటైర్లు వేయలేదని, ఒక దర్శకుడి నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా రూపొందిందని, గతంలో ఈ సంస్థ ద్వారా వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ ఎంతలా హిట్టైందో ఇది కూడా అంతటి విజయాన్ని సాదిస్తుందని అన్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు