‘మిస్టర్’ ఆడియో రిలీజ్ ఎప్పుడంటే !

‘మిస్టర్’ ఆడియో రిలీజ్ ఎప్పుడంటే !

Published on Mar 27, 2017 7:19 PM IST


గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయని మెగా హీరో వరుణ్ తేజ్ ఈ సంవత్సరం రెండు సినిమాల్ని ప్లాన్ చేశాడు. వాటిలో ముందుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్’ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. రిలీజైన టీజర్, ట్రైలర్, కొన్ని పాటలు బాగుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇకపోతే ఈ చిత్రం యొక్క ఆడియో వేడుకను ఈ మార్చి నెల 30వ తేదీన జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.

శ్రీను వైట్ల లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జీమేయర్ సంగీతం అందిస్తుండగా ప్రస్తుతం హైదరాబాద్లో ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణకు టీమ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పాటలో ‘బాహుబలి’ ఫేమ్ మధు స్నేహా మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి చిందులు వేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు