కేసు విషయమై హై కోర్టులో హాజరైన సూపర్ స్టార్ అల్లుడు !

కేసు విషయమై హై కోర్టులో హాజరైన సూపర్ స్టార్ అల్లుడు !

Published on Feb 28, 2017 4:31 PM IST


తమిళ స్టార్ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈరోజు చెన్నై హైకోర్టులోని మధురై బెంచ్ ముందు హాజరయ్యారు. తల్లి విజయలక్ష్మితో సహా కోర్టుకు వచ్చిన ధనుష్ ను జడ్జి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ వైద్యుడు పరిశీలించి అతని పుట్టుమచ్చల వివరాలను సేకరించారు. కొన్ని రోజుల క్రితమే మధురైకి చెందిన వృద్ధ దంపతులు కార్తిరేసన్, మీనాక్షిలు ధనుష్ తమ మూడవ సంతానమని, చదువుకునే వయసులో సినిమాలాంటే ఇష్టంతో ఇంటి నుంచి పారిపోయాడని, అతను హీరో అయ్యాకే అతని జాడ తెలిసిందని అన్నారు.

అంతేగాక ధనుష్ తమ జీవనోపాధికి నెలకు రూ. 60,000 లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేసిన విషయం కూడా తెలిసిందే. కానీ ధనుష్ ఇదంతా ఒట్టి నాటకమని, వారు తన తల్లిదండ్రులు కారని తెలిపారు. ఇరువురి వాదనలు విని, ధనుష్ పుట్టు మచ్చలను వివరాలను సేకరించిన మద్రాస్ హై కోర్ట్ మధురై బెంచ్ కేసును మార్చి 2 గురువారానికి వాయిదా వేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు