‘ధృవ’ టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయిందట..!

‘ధృవ’ టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయిందట..!

Published on Oct 2, 2016 4:27 PM IST

dhruva

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ధృవ’ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్‍ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కొద్దినెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. మొదట ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ నెలలోనే విడుదల చేయాలని టీమ్ భావించినా, అన్ని పనులూ అప్పటికి పూర్తయ్యే అవకాశం కనిపించకపోవడంతో సినిమా డిసెంబర్‍కు వాయిదా పడింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయిందని సమాచారం.

మరో నాలుగు రోజుల టాకీ పార్ట్ మిగిలిఉండగా, ప్రస్తుతం టీమ్ ఈ పార్ట్‌ను పూర్తి చేసే పనిలో పడిపోయింది. ఆ తర్వాత అక్టోబర్ 8 నుండి పాటల షూటింగ్ జరపనున్నారట. రామ్ చరణ్ ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనుండడం, తమిళంళో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్ కావడం, నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటించడం ఇలా ఎన్నో కారణాలతో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోన్న ఈ సినిమా గురించి అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు