ఇక థియేటర్లలో కలుద్దామన్న చరణ్!

ఇక థియేటర్లలో కలుద్దామన్న చరణ్!

Published on Nov 14, 2016 8:24 AM IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమాపై ఏస్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెలరోజుల క్రితమే విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తే, ఈమధ్యే విడుదలైన ఆడియో కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా ఆకట్టుకొని దూసుకుపోతోంది. ఇక వచ్చే నెల 2వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ముందే ప్రకటించిన టీమ్, అందుకు తగ్గట్టే అన్ని కార్యక్రమాలనూ వేగవంతం చేసింది.

నిన్న రాత్రి జరిపిన చివరిపాట షూట్‌తో ధృవ షూటింగ్ మొత్తం పూర్తైంది. ‘ఇక థియేటర్లలో కలుద్దాం, షూట్ అయిపోంద’ని రామ్ చరణ్ తెలియజేశారు. ఇప్పటికే మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. అనుకున్న తేదీకే పక్కాగా సినిమా థియేటర్లలో వాలిపోనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పోలీస్ థ్రిల్లర్‌లో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్‌గా కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు