డిస్ట్రిబ్యూటర్ గా మారిన ‘లౌక్యం’ దర్శకుడు శ్రీవాస్.

డిస్ట్రిబ్యూటర్ గా మారిన ‘లౌక్యం’ దర్శకుడు శ్రీవాస్.

Published on Sep 23, 2014 9:33 AM IST

srivas
గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘లౌక్యం’. ఈ సినిమాతో దర్శకుడు శ్రీవాస్ డిస్ట్రిబ్యూటర్ గా మారుతున్నారు. సెప్టెంబర్ 26న విడుదలవుతున్న ఈ సినిమాను ఈస్ట్‌ గోదావరిలో దర్శకుడు రిలీజ్ చేస్తున్నారు. ఆడియో విడుదలకు ముందే అన్ని ఏరియాలు అమ్ముడైపోయాయి. రచయిత కోన వెంకట్‌ గుంటూరు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అన్నే రవి మరొకరితో కలిసి నెల్లూరులో రిలీజ్‌ చేస్తున్నారు. నేను ఈస్ట్‌ గోదావరిలో రిలీజ్ చేస్తున్నాను అని దర్శకుడు తెలిపారు.

ఇటివలే ఫస్ట్ కాపీ చూసిన మూవీ యూనిట్ సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో కొత్త గోపీచంద్ కనిపిస్తారు. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో విజయం సాదించింది. రీ రికార్డింగ్‌ కూడా అద్భుతంగా చేశాడని దర్శకుడు చెప్పారు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు