నాగచైతన్య ‘దోచేయ్’ సెన్సార్ పూర్తి..!

నాగచైతన్య ‘దోచేయ్’ సెన్సార్ పూర్తి..!

Published on Apr 18, 2015 6:16 PM IST

Dochey
‘స్వామిరారా’ సినిమాతో తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాలకు ఒక కొత్త దారిని ఏర్పరచిన దర్శకుడు సుధీర్ వర్మ. తాజాగా సుధీర్ వర్మ నాగచైతన్యతో ‘దోచేయ్’ పేరుతో మరో సరికొత్త కథాంశంతో సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్‍గా నటించింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టెక్నికల్ కార్యక్రమాలు పూర్తి కాగా నేడు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తయ్యాయ్.

సెన్సార్ సభ్యులు ‘దోచేయ్’ సినిమాకు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేశారు. ఒక్క కట్ కూడా చెప్పకుండా క్లీన్ ‘యూ’ జారీ కావడం విశేషం. ఈ సినిమా పట్ల అంతటా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ చూసిన వారినుండి అద్భుతమైన స్పందన వస్తోంది. సుధీర్ వర్మ మళ్ళీ తన మ్యాజిక్‌ను రిపీట్ చేశాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగచైతన్య తన గత చిత్రాలకు కాస్త భిన్నంగా మంచి టైమింగ్‌తో ఈ సినిమాలో మరింత ఆకట్టుకుంటాడన్న టాక్ వినబడుతోంది. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘దోచేయ్’ సినిమా ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు