‘శ్రీమంతుడు’ డిటిఎస్ వర్క్ ఫినిష్ చేసిన దేవీశ్రీ

‘శ్రీమంతుడు’ డిటిఎస్ వర్క్ ఫినిష్ చేసిన దేవీశ్రీ

Published on Aug 2, 2015 12:31 PM IST

Devi-sri-rprasad

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆగష్టు 7న ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మహేష్ బాబు, అతని టీం ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరగడమే కాకుండా చివరి దశకు చేరుకున్నాయి. ముందుగా ఈ సినిమాని సెన్సార్ కి జూలై 31నే పంపాలి అనుకున్నా అన్నీ పర్ఫెక్ట్ గా రావాలనే ఉద్దేశంతో మరో రెండు రోజులు టైం తీసుకున్నారు.

దేవీశ్రీ ప్రసాద్ నిన్నటి రాత్రితో ఈ సినిమా డిటిఎస్ మిక్సింగ్ పనులు పూర్తి చేసాడు. దాంతో దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి. దేవీశ్రీ ప్రసాద్ డిటిఎస్ వర్క్ ఫినిష్ చెయ్యడమే కాకుండా మహేష్ బాబు పెర్ఫార్మన్స్ సినిమాలో అమేజింగ్ గా ఉందని, కొరటాల శివ టీంది సూపర్బ్ జాబ్ అని తెలియజేశాడు. మహేష్ బాబు శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. మహేష్ బాబుకి పారెంట్స్ గా జగపతిబాబు, సుకన్య కనిపించనున్న ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి, అంగన రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు