నందమూరి హీరో సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి !

నందమూరి హీరో సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి !

Published on Mar 22, 2018 6:27 PM IST

కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా నా నువ్వే. జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లో తమన్నా రేడియో జాకీ పాత్రలో కనిపించబోతోంది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మిస్తున్న ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరి గా తెరకెక్కబోతోంది. మే 25 న సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. తమిళ్ లో సిద్ధార్థ్ తో ‘108’ సినిమా నిర్మించిన జయేంద్ర తెలుగులో ఈ సినిమా చెయ్యడం విశేషం. ఈరోజు నుండి ‘నా నువ్వే’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రేపు కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంఎల్ఎ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు