‘బాహుబలి 2’ తర్వాత ‘ఈగ 2’ చేసే ఆలోచనలో రాజమౌళి.!

‘బాహుబలి 2’ తర్వాత ‘ఈగ 2’ చేసే ఆలోచనలో రాజమౌళి.!

Published on Aug 3, 2015 4:58 PM IST

Eega
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తన లేటెస్ట్ విజువల్ వండర్ ‘బాహుబలి’ తో పెద్ద సక్సెస్ అందుకున్నాడు. గత నెల రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీసు రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా టాప్ సెలబ్రిటీస్ నుంచి కూడా ప్రశంశలు అందుకుంది. ఫస్ట్ పార్ట్ కి వచ్చిన రెస్పాన్స్ తో సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగిపోవడంతో ప్రస్తుతం రాజమౌళి ఆ అంచనాలను అందుకునే రేంజ్ లో కథని సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కి సంబదించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

సెప్టెంబర్ నుంచి సెకండ్ పార్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. బాహుబలి సెకండ్ పార్ట్ ని వచ్చే ఏడాది రిలీజ్ చేసే విధంగా రాజమౌళి ప్లాన్ చేసాడు. అది పక్కన్న పెడితే రాజమౌళి నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆయన సన్నిహితుల నుంచి చెబుతున్న సమాచారం ప్రకారం బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ భాగం ఈగ 2 సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. రాజమౌళి కూడా పలు సందర్భాల్లో తనకి ఈగ 2 చేసే ఆలోచన బలంగా ఉందని చెప్పారు. దాంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు