అవార్డుల పంట పండించిన ఈగ, మిర్చి!

అవార్డుల పంట పండించిన ఈగ, మిర్చి!

Published on Mar 1, 2017 4:05 PM IST


తాజాగా కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ప్రకటించింది. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘మిర్చి’, త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు అనేక విభాగాల్లో ఎక్కువ అవార్డులను సొంతం చేసుకున్నాయి. మొదటి రాజమౌళి ‘ఈగ’ విషయానికొస్తే 2012 ఉత్తమ చిత్రం అవార్డు పొందిన ఈ చిత్రం, రాజమౌళికి ఉత్తమ దర్శకుడు, నటుడు సుదీప్ కు ఉత్తమ ప్రతినాయకుడి అవార్డును అందించింది.

ఇక ‘మిచ్చి’ విషయానికొస్తే 2013 ఉత్తమ చిత్రంగా నిలిచిన ఈ సినిమా హీరో ప్రభాస్ కు ఉత్తమ హీరో, దర్శకుడు కొరటాల శివకు ఉత్తమ డెబ్యూట్ డైరెక్టర్ అవార్డులు దక్కేలా చేసింది. అలాగే 2013లోనే త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ ల కలయికలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ 2013 మోస్ట్ పాపులర్ సినిమాగా నిలవడమే కాకుండా బెస్ట్ డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ కు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ కు అవార్డులు వచ్చేలా చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు