షూటింగ్ చివరిదశలో ‘ఎర్రబస్సు’.

షూటింగ్ చివరిదశలో ‘ఎర్రబస్సు’.

Published on Sep 19, 2014 2:00 PM IST

dasari-vishnu
దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్య పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘ఎర్రబస్సు’. తమిళంలో సంచలన విజయం సాదించిన ‘మాంజ పాయ్’కి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా దాసరి 151వ సినిమా కావడం విశేషం. మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. సెప్టెంబర్ 20వ తేది వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఆగస్ట్ ప్రారంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయింది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. మంచు విష్ణు కేథరీన్ త్రేసా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు చక్రి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత నిర్మాణంతర కార్యక్రమాలు మొదలు పెడతారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు