ప్రత్యేకం : డైన్ విత్ స్టార్స్ లో కాజల్, దీక్ష సేథ్, రానా ఫ్యాషన్ షో

ప్రత్యేకం : డైన్ విత్ స్టార్స్ లో కాజల్, దీక్ష సేథ్, రానా ఫ్యాషన్ షో

Published on Nov 26, 2014 11:01 AM IST

Rana-Kajal
తెలుగు చిత్ర పరిశ్రమ ‘మేముసైతం’ ద్వారా హుదూద్ బాధితుల కోసం ఫండ్ రైజ్ చేస్తోంది. అందులో భాగంగా పలు కార్యక్రమాలను కూడా చేపడుతోంది. ఈ కార్యక్రమాల్లో ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసేలా డిజైన్ చేసిందే ‘డైన్ విత్ స్టార్స్’. ఈ డైన్ విత్ స్టార్స్ కి వెళ్ళాలంటే ఒక కపుల్ టికెట్ ధర లక్ష రూపాయలు. నవంబర్ 29వ తేదీ రాత్రి బాగా గ్రాండ్ గా జరగనున్న ఈ డైన్ విత్ స్టార్స్ కోసం ఇప్పటికే పలువురు ఈ టికెట్స్ ని కొనుగోలు చేసారు.

ఈ డైన్ విత్ స్టార్స్ ప్రోగ్రాంలో కేవలం మీరు స్టార్స్ తో కలిసి డిన్నర్ చెయ్యడమే కాకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి పలు కార్యక్రమాలు కూడా చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది ఫ్యాషన్ షో.. ఈ ఫ్యాషన్ షోలో హైలైట్ ఏమిటంటే మన మిస్ ఇండియాలో గెలుపొందిన వారు అలాగే చివరి వరకూ మిస్ ఇండియా టైటిల్ కోసం పోరాడిన వారు రాంప్ వాక్ చెయ్యనున్నారు. 3 దశలుగా జరగనున్న ఫ్యాషన్ షోలలో షో టాపర్స్ గా కాజల్ అగర్వాల్, దీక్ష సేథ్, రానా మరియు మంచు లక్ష్మీ పాల్గొననున్నారు. ఈ ఫ్యాషన్ షో మాత్రమే కాకుండా కామెడీ సర్కస్ ఫేం మంత్ర, ఫేమస్ సింగర్ షిబాని కశ్యప్, దేవీశ్రీ ప్రసాద్ కాన్సెర్ట్ కూడా ఉంటుంది. ఇకపోతే ఈ డైన్ విత్ స్టార్స్ ప్రోగ్రాంకి యంగ్ హీరో నవదీప్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు