నాగార్జున పాత్రపై ఆసక్తి పెంచుకున్న ఫ్యాన్స్

నాగార్జున పాత్రపై ఆసక్తి పెంచుకున్న ఫ్యాన్స్

Published on Aug 2, 2015 5:52 PM IST

nagarjuna

అక్కినేని నాగార్జున ప్రస్తుతం కార్తీతో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ సినిమాలో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఫాన్స్ లోని సూపర్బ్ లోకేషన్స్ లో షూట్ చేస్తున్నారు. నాగార్జున – కార్తీకి జోడీగా మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించనుంది. నిన్న నాగార్జున షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని స్టిల్స్ ని రిలీజ్ చేసాడు. ఈ స్టిల్స్ సినిమాపై ఆసక్తిని మరీ పెంచేశాయి. అందులో ఓ స్టిల్ లో నాగార్జున వీల్ చైర్ లో కూర్చొని ఉంటే, కార్తీ, తమన్నా కలిసి తనని తీసుకెళుతూ ఉంటారు. చూడటానికి అదొక మ్యూజియం అని తెలుస్తోంది. ఈ స్టిల్ నాగార్జున అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచేస్తోంది.

ఈ స్టిల్స్ రిలీజ్ చేసినప్పటి నుంచీ ఈ సినిమా ఎలా ఉండబోతుండా అనే ఆసక్తి కూడా పెరిగింది. నాగార్జున ఇందులో ఎలాంటి రోల్ చేసాడా అని నాగార్జున అభిమానుల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మక సినిమాలకు, పాత్రలకు ఎప్పుడూ సిద్దంగా ఉండే నాగార్జున ఈ సినిమాలో కూడా ఓ సరికొత్త పాత్రలో కనిపిస్తాడని సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయి. పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు