ఆడియో ఫంక్షన్ లో అలరించనున్న తండ్రీ కొడుకులు

ఆడియో ఫంక్షన్ లో అలరించనున్న తండ్రీ కొడుకులు

Published on Jul 22, 2014 12:43 AM IST

Mahesh-babus-son
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తనయుడు గౌతం తో కలసి ‘ఆగడు’ ఆడియో లాంచ్ లో అలరించనున్నాడు. ఈ ఆడియో లాంచ్ ఆగస్ట్ 31 న జరగనుంది. ఆ రోజు గౌతం పుట్టినరోజు కావడం విశేషం. ‘1-నేన్నోకిడినే’ చిత్రం ద్వారా పరిచయం అయిన ‘గౌతం’ ఈ మధ్యన తరచుగా పబ్లిక్ లో కనిపిస్తున్నాడు.

సెప్టెంబర్ లో విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరగుతుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో మహేష్ బాబు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్ పాత్ర పోషిస్తున్నాడు.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు