అక్కడ ప్రేక్షకులు ‘ఫిదా’ అవుతారా ?

అక్కడ ప్రేక్షకులు ‘ఫిదా’ అవుతారా ?

Published on Nov 7, 2017 12:41 PM IST

డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఒకప్పుడు వరుసగా విజయాలు అందించాడు, ఆ మద్య తను తీసిన ‘అనామిక’ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలు సక్సెస్ కాలేదు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ గా సాయి పల్లవి తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. దిల్ రాజు నిర్మిచిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా మలయాళంలో విడుదల చేస్తున్నారు.

‘ఫిదా’ పేరుతోనే ఈ సినిమాను మలయాళంలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు, ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో అక్కడ విడుదల కాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాదిస్తుందేమో చూడాలి. తెలుగులో విడుదల అయిన చాలా మలయాళం డబ్బింగ్ సినిమాలు విజయవంతం అయ్యాయి అలాగే ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆధరిస్తారని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు