సక్సెస్ సంబరాలు జరపనున్న ‘ఫిదా’ టీమ్ !

సక్సెస్ సంబరాలు జరపనున్న ‘ఫిదా’ టీమ్ !

Published on Jul 26, 2017 4:15 PM IST


మెగా హీరో వరుణ్ తేజ్ – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన ‘ఫిదా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు పెట్టిన మొత్తాన్ని రాబట్టిన ఈ చిత్రం ఇకపై లాభాల పంట పండించనుంది. దీంతో సినిమాను కొన్న వారంతా సంతోషంగా ఉన్నారు. ఇక ఓవర్సీస్లో సైతం సినిమా బ్రహ్మాండంగా ఆడుతూ మిలియన్ మార్కును క్రాస్ చేసి రెండు మిలియన్లను అందుకునే దిశగా వెళుతోంది.

ఈ చిత్రంతో వరుణ్ తేజ్ కమర్షియల్ సక్సెస్ మాత్రమే గాక, యూఎస్ లో మొదటి మిలియన్ డాలర్ రికార్డ్ లభించింది, అంతేగాక చాలా కలమ తర్వాత డైరెక్షన్ చేసిన శేఖర్ కమ్ములకు సాలిడ్ హిట్ దొరికింది. హీరోయిన్ సాయి పల్లవికి టాలీవుడ్లో స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. నిర్మాత దిల్ రాజు వరుసగా మరో సక్సెస్ ను అందుకున్నారు. ఇలా అన్ని విధాలుగా అందరి ఉన్నతికి తోడ్పడ్డ ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్ర బృందం రేపు హైదరాబాద్లో సక్సెస్ సంబరాలను నిర్వహించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు