‘మహానటి’ నుండి మరొక విశేషం

‘మహానటి’ నుండి మరొక విశేషం

Published on Apr 19, 2018 1:51 PM IST


అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న చిత్రం ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా సమంత, విజయ్ దేవరకొండ జర్నలిస్ట్ పాత్రల్లోను, నాగ చైతన్య అక్కినేని నాగేశ్వరరావ్ పాత్రలోను, దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్రలోను నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా యొక్క టీజర్ కూడ ప్రేక్షకులను బాగా మెప్పించింది.

దీంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఇక యూనిట్ సభ్యులు సినిమాలోని మొదటి పాట ‘మూగ మనసులు’ను రేపు విడుదలచేయనుంది. మరి అన్నిటిలోను ఏదో ఒక ప్రత్యేకతను చాటుతున్న ఈ సినిమా మరి రేపు పాటతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మే 9వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు