వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తెలుగు యువహీరోల్లో తనదంటూ ఒక మార్క్ సెట్ చేసుకుంటూ వెళుతోన్న హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతోన్న ఈ హీరో తమిళ, మళయాలంలో బంపర్ హిట్ కొట్టిన ‘నేరమ్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు టైటిల్ను ఎంపిక చేయమని టీమ్ అభిమానులను కోరిన విషయం తెలిసిందే.
ఇక అలా వచ్చిన టైటిల్స్ నుంచి చివరకు ఐదు టైటిల్స్ను ఫైనల్ చేశారు. ‘రన్’, ‘123’, ‘టైమ్ బాబూ టైమ్’, ‘జిందగీ’, ‘నాకూ టైమ్ వచ్చింది’ లాంటి ఐదు టైటిల్స్ను ఫైనల్ చేశారు. ఇందులో నుంచి ఏదో ఒక టైటిల్ను కూడా ప్రేక్షకులనే ఎంపిక చేయమని సినిమా యూనిట్ మరో కాంటెస్ట్ను పెట్టింది. ఫిబ్రవరి 14న సినిమాకు ఫిక్స్ చేసిన టైటిల్ను ప్రకటించనున్నారు. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సందీప్ కిషన్ సరసన అనీషా ఆంబ్రోస్ హీరోయిన్గా నటించారు.