చివరి దశ షూటింగ్లో మంచు హీరోల సినిమా !

చివరి దశ షూటింగ్లో మంచు హీరోల సినిమా !

Published on Dec 18, 2017 12:54 PM IST

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు కలిసి నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా ఆఖరి దశ షూటింగ్ కు చేరుకుంది. డైరెక్టర్ మదన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితమే మోహన్ బాబు ప్రకటించారు.

ఈ చిత్రం గురించి విష్ణు మాట్లాడుతూ నేనిప్పటి వరకు చేసిన ప్రేమ కథా చిత్రాల్లో ఇదే ఉత్తమమైనదని అన్నారు. ఈ చిత్రంలో శ్రియ శరన్, నిఖిల విమల, అనసూయలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఈ సినిమాను మోహన్ బాబు తన సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పై స్వయంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు