ప్రచారాన్ని ముమ్మరం చేసిన మోహన్ బాబు టీమ్ !

ప్రచారాన్ని ముమ్మరం చేసిన మోహన్ బాబు టీమ్ !

Published on Jan 17, 2018 4:53 PM IST

కలెక్షన కింగ్ మోహన్ బాబు రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. డైరెక్టర్ మదన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఇదివరకే టీజర్ ను విడుదలచేసిన టీమ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు సినిమాలో ముఖ్యమైన పాట ‘జై హనుమ’ కు సంబందించిన వీడియోను రిలీజ్ చేయనుంది.

ఈ పాట చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన హనుమంతుడి విగ్రహం, భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులను వినియోగించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియ శరన్, నిఖిల విమలలు పలు కీలక పాత్రల్లో నటించారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేసిన మోహన్ బాబు టీమ్ !

సంబంధిత సమాచారం

తాజా వార్తలు