ఇద్దరు యువహీరోలు ట్విట్టర్ లో మంచి ఫాలోయింగ్ !

ఇద్దరు యువహీరోలు ట్విట్టర్ లో మంచి ఫాలోయింగ్ !

Published on Feb 18, 2018 6:09 PM IST

దాదాపు అందరు సెలెబ్రిటీస్ కు ట్విట్టర్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు సెలెబ్రిటీస్ విషయానికి వస్తే తాజాగా ఇద్దరు యువ హీరోలు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. నితిన్ ట్విట్టర్ అకౌంట్ లో 2 మిలియన్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకుంటే సాయి ధరమ్ తేజ్ 1 మిలియన్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో చల్ మోహన్ రంగ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించబోతున్నాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ మే నెల నుండి ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు