ఆఖరి దశలో గోపిచంద్ చిత్రం !

ఆఖరి దశలో గోపిచంద్ చిత్రం !

Published on Jun 26, 2017 6:03 PM IST


మ్యాచో మ్యాన్ గోపిచంద్ చేస్తున్న చిత్రాల్లో సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమ్ నంద’ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ చివరి దశలో ఉంది. దర్శకుడు సంపత్ నంది గొపిచంద్, హన్సికల మధ్య ‘బోలె రామ్ బోలె రామ్’ అనే రొమాంటిక్ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ స్పెషల్ రొమాంటిక్ సాంగ్ సినిమాలోని మేజర్ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని తెలుస్తోంది.

గతంలో సంపత్ నంది చరణ్ ‘రచ్చ’ సినిమాలో ‘వాన వాన వెల్లువాయె’ , ‘బెంగాల్ టైగర్’ లో ‘చూపులతో దీపాల’ వంటి పాటలను అందంగా చిత్రీకరించి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. జె. భగవాన్, జె. పుల్లారావులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హన్సిక, క్యాథరిన్ థ్రెసాలు హీరోయిన్లుగా నటించారు. దుబాయ్ వంటి లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం గోపిచంద్, సంపత్ నంది ల కెరీర్లకు కీలకమైన చిత్రం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు