‘గుంటూరోడు’ ప్రోగ్రాం వాయిదా వేసుకున్న మనోజ్!

‘గుంటూరోడు’ ప్రోగ్రాం వాయిదా వేసుకున్న మనోజ్!

Published on Dec 6, 2016 6:15 PM IST

manoj1
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, కొద్దికాలంగా హిట్ కోసం ఎంతగానో తపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనకు మంచి గుర్తింపు తెచ్చిన డిఫరెంట్ కమర్షియల్ సినిమానే నమ్ముకొని ‘ఒక్కడు మిగిలాడు’, ‘గుంటూరోడు’ అన్న రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో గుంటూరోడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని టీజర్ లాంచ్‌కు సిద్ధమైంది.

డిసెంబర్ 7న గుంటూరులో పెద్ద ఎత్తున ఈ సినిమా టీజర్ లాంచ్‌ను చేపట్టాలని ప్లాన్ చేశారు. అయితే తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జయలలిత మరణించడంతో, గుంటూరోడు టీజర్ విడుదలను వాయిదా వేశారు. ఒక గొప్ప నాయకురాలిని కోల్పోయిన ఈ తరుణంలో టీజర్ లాంచ్ చేయదల్చుకోలేదని చెబుతూ, కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మంచు మనోజ్ తెలిపారు. సత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు