హెబ్బా పటేల్ పారితోషికం పెంచేసిందట!

హెబ్బా పటేల్ పారితోషికం పెంచేసిందట!

Published on Dec 11, 2016 5:48 PM IST

hebha-patel
హెబ్బా పటేల్ ఇప్పుడు మిడిల్ లెవెల్ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినవే కాబట్టి హెబ్బా తమ సినిమాలో ఉండాలని దర్శక, నిర్మాతలు కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ వెళుతోన్న ఆమె, పారితోషికం పెంచేశారని ప్రచారం జరుగుతోంది. హెబ్బా ఇదివరకు డిమాండ్ చేసిన దానికంటే ఇప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని వినిపించింది.

ఇక తాజాగా ఈ విషయమై హెబ్బా పటేల్ స్వయంగా స్పందిస్తూ తాను పారితోషికం పెంచినట్లు వస్తోన్న వార్తలు నిజమే అని స్పష్టం చేశారు. వరుస హిట్స్ ఇస్తున్నపుడు రెమ్యునరేషన్ పెంచడంలో తప్పేముందని హెబ్బా ఓ మీడియా సమావేశంలో అన్నారు. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘నాన్న, నేను, నా బాయ్‌ఫ్రెండ్స్’ ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు