రాజమౌళికి థాంక్స్ చెప్పిన హీరో కార్తి !

రాజమౌళికి థాంక్స్ చెప్పిన హీరో కార్తి !

Published on Oct 26, 2016 4:31 PM IST

karthi
హీరో కార్తి నటించిన ‘కాష్మోరా’ చిత్రం 28వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకానుంది. దీనికి సంబందించిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహిచింది. ఇందులో హీరో కార్తి మాట్లాడుతూ ‘రెండేళ్ల క్రితం సినిమాని మొదలుపెట్టాం. కానీ ఈ మధ్యలోనే ‘బాహుబలి’ విడుదలైంది. అది చూశాక రెండునెలల పాటు మా షూటింగ్ ఆపేసి మళ్ళీ సినిమాలో చాలా మార్పులు చేశాం. బాహుబలి వచ్చి ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. దానికి తగ్గట్టు మా సినిమా కూడా ఉండాలని చాలా కష్టపడ్డాం’ అన్నారు.

అలాగే బాహుబలి తమకు ఇంకో విధంగా చాలా బాగా ఉపయోగపడిందని చెబుతూ ‘బాహుబలి కోసం రాజుగారు విజువల్ ఎఫెక్ట్స్ మీద చాలా వర్క్ చేశారు. విదేశాల నుండి టెక్నీషియన్స్ ను ఇక్కడకు తీసుకొచ్చి పనిచేయించారు. వాళ్లతోపాటే పనిచేసిన చాలామంది లోకల్ టెక్నీషియన్లు బాగా ట్రైన్ అయ్యారు. దాంతో మాకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. చెన్నైలో ఉన్న వాళ్ళే అన్నీ చేసేశారు. మా పని ఇంత సులభం చేసిన రాజుగారికి థాంక్స్ చెప్పుకోవాలి’ అని రాజమౌళి తమ సినిమాకి ఎలా మేలు చేసిందీ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు