ఎన్టీఆర్, చరణ్ ల మల్టీ స్టారర్ కు భారీ బడ్జెట్ !

ఎన్టీఆర్, చరణ్ ల మల్టీ స్టారర్ కు భారీ బడ్జెట్ !

Published on Apr 18, 2018 9:16 AM IST

ప్రస్తుతం టాలీవుడ్లో రూపొందుతున్న బడా సినిమాల్లో మూడు నిర్మాత డివివి. దానయ్య నిర్మిస్తున్నవే. ఈ మూడు సినిమాల్లో ఇప్పటికే మహేష్, కొరటాల శివల ‘భరత్ అనే నేను’ పూర్తై ఈ నెల 20న విడుదలకానుండగా రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక దానయ్య నిర్మిస్తున్న మరొక సినిమా చరణ్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్.

రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ చిత్రాన్ని ఏ ఏడాదిలోనే ప్రారంభించనున్నారు. ఈ భారీ చిత్రానికి సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు దానయ్య తెలిపారు. రాజమౌళి తనకు, ఇతర టెక్నీషియన్లకు కథ చెప్పారని, సినిమా విజువల్ వండర్ గా ఉండబోతోందని ఆయన అన్నారు. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు