నవంబర్ 22న టీజర్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ !

నవంబర్ 22న టీజర్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ !

Published on Nov 19, 2019 7:34 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా టీజర్ కి సంబంధించి గత కొన్నిరోజులుగా చిత్రయూనిట్ ఇన్ డైరెక్ట్ గా అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. ఒకపక్క షూటింగ్ ను జరువుకుంటూనే, మరోపక్క మొత్తానికి ప్రమోషన్స్ పనులను కూడా వేగవంతం చేసింది టీమ్. దీనిలో భాగంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారు. నవంబర్ 22న సాయంత్రం 5 గంటల 4 నిముషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది.

కాగా ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు