గోవా బ్యూటీకి బాలీవుడ్లో మరో బంపర్ ఆఫర్

గోవా బ్యూటీకి బాలీవుడ్లో మరో బంపర్ ఆఫర్

Published on Nov 30, 2015 10:15 AM IST

ileana
‘దేవదాసు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై వెంటనే పోకిరి సినిమాతో కుర్రకారుని తన మాయలో పడేసుకొని, బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత సౌత్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఇలియానా ఈ మధ్య సౌత్ సినిమాలకి గుడ్ బై చెప్పి, బర్పీ సినిమాతో బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. కానీ మొదటి రెండు సినిమాలు హిట్ అయినా ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇలియానాకి ఆఫర్స్ తగ్గాయి. దాంతో ఇలియానా గత కొద్ది రోజులుగా బాలీవుడ్ లోనే ఉండాలా లేక సౌత్ లోకి రావాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉండిపోయింది.

కానీ ఇలియానా కన్ఫ్యూజన్ కి తెరపడేలా చేసింది బాలీవుడ్ నుంచి వచ్చిన బంపర్ ఆఫర్.. బాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన అక్షయ్ కుమార్ సరసన ఇలియానా హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. స్పెషల్ 26, బేబీ సినిమాలకి కలిసి పనిచేసిన అక్షయ్ కుమార్ – నీరజ్ పాండేలు కలిసి ఓ రొమాంటిక్ థ్రిల్లర్ చేయనున్నారు. ఈ సినిమాని నీరజ్ పాండే నిర్మాతగా మారి తన అసిస్టెంట్ తిను దేశాయ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ‘రస్తోం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఇలియానా ఇందులో మెయిన్ హీరోగా కనిపించనుంటే, లేడీ విలన్ గా ఈశ గుప్త కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు