సల్మాన్ ఖాన్ ను దాటేసి హాట్ టాపిక్ గా మారిన బన్నీ !

సల్మాన్ ఖాన్ ను దాటేసి హాట్ టాపిక్ గా మారిన బన్నీ !

Published on Jun 24, 2017 7:02 PM IST


తెలుగు సినిమా ‘బాహుబలి-2’ దేశ వ్యాప్తంగా ముఖ్యంగా బాలీవుడ్లో సృష్టించిన ప్రభంజనం మరువక ముందే మరోక చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ కూడా సరికొత్త ఫీట్ ను సాధించి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అది కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘ట్యూబ్ లైట్’ ను బీట్ చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయి అల్లు అర్జున్ పేరు మారు మోగిపోతోంది.

డీజే విడుదలైన మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 18 కోట్ల షేర్ ను వసూలు చేసి ఓవర్సీస్లో సల్లు భాయ్ సినిమాను ఈజీగా అధిగమించేసింది. మొదటి రోజు ప్రీమియర్ల ద్వారా డీజే 3.50 లక్షల డాలర్లను రాబట్టగా ట్యూబ్ లైట్ మాత్రం 1.87 లక్షల డాలర్లతో సరిపెట్టుకుంది. డీజే, ట్యూబ్ లైట్ కన్నా తక్కువ థియేటర్లలో విడుదలై ఈ ఘనత సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు